ఈ సమయం లో వైద్యం తో పాటు దైర్యం కల్పించే వార్తలు కావాలి : పూర్ణ చంద్ర రావు చలాది
వైద్యం తో పాటు ధైర్యం కల్పించే వార్తా కధనాలు దేశప్రజలకు నేడు పరమ ఔషధం అని మీడియా గుర్తించాలి.
అరుంధతి రాయ్ అసందర్భ ప్రకటన చెయ్యటం కాదు,ప్రజల్లో ధైర్యం కల్పించే లా వ్యవహరించాలి..సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్ర రావు విజ్ఞప్తి.
విజయవాడ//
భారత్లో కోవిడ్ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానిస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వశక్తులూ వినియోగించు కోవాలనీ ,
అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలని పేర్కొవటం పట్ల సీనియర్ పాత్రికేయుడు అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు సీహెచ్.పూర్ణచంద్రరావు అభ్యంతరం చెప్పారు. ఏదేశానికైనా సైన్యం మూడవ నేత్రం లాంటిదని పైగా దేశానికి ఎంతో విలువైనదని, తుఫానులు,భూకంపాలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు,భారీ ప్రమాదాల్లో సైన్యం సహాయం కోరవచ్చని అయితే ఇలాంటి ప్రమాదకర వైరస్ కరోనా లాంటి మహమ్మారి కోరల్లో చిక్కుకోకుండా సైన్యాన్ని కాపాడుకోవాలని ,అందుకు వారిని ఈ సేవకు వినియోగించుకోకుంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు..ఇప్పటికే ఆయా రాష్ట్రముల పోలీస్ శాఖలు సహాయక కార్యక్రమాల్లో అంకితమై ఎందరో వ్యాధికి గురైన విషయం తెలిసిందే.
అయితే వైద్య పరికరాలు,వైద్య సిబ్బందిని తరలించేందుకు సైన్యం ,నావికా,వాయు దళాల రవాణా వ్యవస్థను వినియోగించు కోవాలన్నారు.
డా .అంథోని పౌచి కే పేర్కొన్నట్లు వైద్య సామగ్రి అందించడమే కాదు, వైద్య సిబ్బందిని కూడా భారత్కు పంపించాలని ఇతర దేశాలకు ఆయన చేసిన విజ్ఞప్తి కి పూర్ణచంద్ర రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి జాతీయ ఉపద్రవం వచ్చినప్పుడు మీడియా ప్రజలను భయా లకు గురిచేసే విధంగా వార్తలు రాయకుండా ధైర్యం కల్పించే రీతిలో ఉండేలా స్వయం నియంత్రణ విదించుకోవాలని పూర్ణచంద్ర రావు జాతీయ,అంతర్జాతీయ మీడియాకి విజ్ఞప్తి చేసారు.
భారత్ లో
లాక్డౌన్ విధించాలని డా.పౌచి సూచినకు ముందే వైరస్ వ్యాప్తి మరింత విజృంభించ కుండా ఇప్పటికే భారత్ ఆ నిర్ణయం వైపు పయనిస్తోంది,ఇప్పటికే ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ పకడ్బందీగా అమలుచేస్తోందన్నారు.
దేశం నేడు ఎదుర్కొంటున్న కోవిడ్ 19 మహమ్మారి తో ఒకవైపు ఉండగా ప్రముఖ రచయిత్రి డా.అరుంధతి రాయ్ ప్రధానిని దిగిపొమ్మని,ఇంకా ఏవేవో అశాంతి , భయాందోళన కలిగించే రీతిలో ప్రకటన ఇవ్వటం సబబుగా లేదన్నారు.
ప్రస్తుతం దేశంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ కి,కరోనా పీడితులకు వైద్యం తో పాటు వారికి ధైర్యం కలిగించే వార్తా కధనాలు అవసరముందని అందుకు మీడియా సహాయం అవసరం ఎంతో ఉందన్నారు. అరుంధతి రాయ్ ఇలాంటి అసందర్భ ప్రకటనలు చేసి ప్రజల్లో ఆందోళనకు గురిచేయటం మంచిది కాదని గ్రహించాలని పూర్ణచంద్ర రావు కోరారు.ప్రస్తుతం వ్యాధి కి ఔషధాలతో వైద్యుల సేవలతో పాటు గందరగోళం కలిగించకుండా వార్తా కదనములు దేశప్రజలకు